అగ్నిప్రమాద బాధితులకు టీఆర్ఎస్ చేయూత

by  |
అగ్నిప్రమాద బాధితులకు టీఆర్ఎస్ చేయూత
X

దిశ, దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో రెండు ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను శుక్రవారం టీఆర్ఎస్ బృందం పరామర్శించింది. మండల అధ్యక్షుడు అన్నె సత్యనారాయణమూర్తి, ఎంపీపీ రేసు లక్ష్మి చేతులమీదుగా బాధిత కుటుంబానికి వంటపాత్రలు, దుప్పట్లు, నిత్యావసరాలు పంపిణీ చేశారు.

అలాగే ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఆర్థిక సహాయం త్వరితంగా అందించాలని అధికారులను కోరారు. టీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉందని ధైర్యంగా ఉండాలని బాధితులకు హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో సర్పంచ్ తులసి, ఎంపీటీసీ, రామారావు, సోడి తిరుపతి రావు, పార్టీ ప్రధానకార్యదర్శి కణితి, రాముడు,అధికార ప్రతినిధి ఎండీ జానీపాషా,రైతు విభాగం కార్యదర్శి జోగావెంకటరమణ, ప్రచారకమిటి అధ్యక్షుడు దామెర్ల శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మోత్కురి, శ్రీకాంత్, పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed