మరోసారి ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఫోన్ చేస్తే.. ఊరుకునేది లేదు

by  |
TRS leaders
X

దిశ, అచ్చంపేట: నిత్యం ప్రజాసేవకు అంకితమై అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తోన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు ఆలూరు కర్ణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూర్ గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నాయకులకు దమ్ము, ధైర్యం లేకనే ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విసిరిన సవాల్‌‌ను ఎవరూ స్వీకరించలేదని మండిపడ్డారు. సవాల్‌కు ప్రతి సవాల్ స్వీకరించడం చేతగాక బీజేపీ గుండాలతో ఫోన్లు చేయించి, ఎమ్మెల్యేను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని హెచ్చరించారు.

బీజేపీ నేతలకు నిజంగా దమ్ముంటే.. ఎంపీ ధర్మపురి అర్వింద్ హామీ ఇచ్చిన పసుపుబోర్డు ఎందుకు తీసుకురాలేకపోయాడో ప్రశ్నించాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని సన్నాయి నొక్కులు నొక్కుతూ పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ మీద రాసిచ్చి మోసం చేసింది నిజం కాదా అని మండిపడ్డారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విసిరిన సవాలును స్వీకరించలేని, దమ్ములేని, బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించే అర్హత లేదని అన్నారు. అజ్ఞానులతో ఫోన్ చేయించడం కాదని, చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా నిజామాబాద్‌కు పసుపు బోర్డు సాధించాలని తెలిపారు. అలాకాకుండా.. మరోసారి గువ్వల జోలికొస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అమ్రాబాద్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి రవి కుమార్, నరేష్, ఆంజనేయులు, అనంతరాములు పాల్గొన్నారు.

Next Story

Most Viewed