పూటకో పార్టీ మారే నువ్వు ‘గండ్ర’ ను విమర్శిస్తావా..?

by  |
పూటకో పార్టీ మారే నువ్వు ‘గండ్ర’ ను విమర్శిస్తావా..?
X

దిశ, భూపాలపల్లి : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పై అసత్యపు ఆరోపణలు చేస్తే సహించేది లేదని జిల్లా టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. శుక్రవారం భూపాల పల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెరాస జిల్లా నాయకులు బుర్ర రమేష్ గౌడ్, మునిసిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, భూపాల పల్లి పట్టణ అధ్యక్షులు కటకం ధనుంజయ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడుతూ ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని, తమ నాయకుల పై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రజల్లో సానుభూతి సంపాదించేందుకే గండ్ర వెంకటరమణా రెడ్డి పై ఆరోపణలు చేశారు తప్పా.. వాటిలో ఏ మాత్రం నిజం లేదని తీవ్రంగా ఖండించారు. పూటకో పార్టీ మార్చిన గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీలో చేరి చేసేదేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగు విధమైన గుణపాఠం చెబుతారన్నారు.

ప్రజల అభీష్టం మేరకే తెరాసలో చేరిక..
భూపాలపల్లి జిల్లా ప్రజల అభీష్టం మేరకే గండ్ర వెంకటరమణా రెడ్డి తెరాస పార్టీలో చేరడం జరిగింది అని తెరాస నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన అనంతరం తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతంలోని సింగరేణి అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్న పార్టీలోకి ఈ ప్రాంతంలోని ప్రజలు, కార్యకర్తలు ఒత్తిడి మేరకే పార్టీలో చేరనట్టు తెరాస నాయకులు తెలిపారు.



Next Story

Most Viewed