టీఆర్ఎస్ రిసార్ట్ పాలిటిక్స్ షురూ.. గోవా టూర్‌‌కు గులాబీ లీడర్లు!

by  |
టీఆర్ఎస్ రిసార్ట్ పాలిటిక్స్ షురూ.. గోవా టూర్‌‌కు గులాబీ లీడర్లు!
X

దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను మొదటి దశలో హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట రిసార్ట్స్‌కు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తరలించిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లో వారిని నియోజకవర్గాల వారీగా విభజించి బెంగుళూరు, గోవాలతో పాటు ఇతర టూరిజం ప్లేసులకు తీసుకెళ్లేందుకు అధిష్టానం ప్లాన్ చేసింది.

ప్రజా ప్రతినిధులతో పాటు మహిళా ప్రతినిధుల భర్తలను కూడా క్యాంపులకు తరలించడంతో వెయ్యికి పైగా సంఖ్య అవుతున్నది. దీంతో వారిని నియోజకవర్గాల వారీగా గ్రూపులు తయారు చేసి వివిధ ప్రాంతాలకు తరలించే ఏర్పాటు చేశారు. కరీంనగర్‌లో మాత్రం అర్బన్, రూరల్ ప్రతినిధులను వేర్వేరుగా చేసి టూర్స్‌ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.


Next Story

Most Viewed