- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, చేవెళ్ల: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిందని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఏకగ్రీవంగా విజయం సాధించడంతో శనివారం ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేతలు మహేందర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయం సాధించి పెట్టారన్నారు. అధికారికంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story