ఈసీ అదనపు సీఈవోను కలిసిన టీఆర్‌ఎస్ నేతలు!

by  |
ఈసీ అదనపు సీఈవోను కలిసిన టీఆర్‌ఎస్ నేతలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో బీజేపీ నేతలు అలజడులు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని టీఆర్‌ఎస్ నేతలు అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అదనపు సీఈవో బుద్ధాప్రకాశ్‌ను కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.

దీనిపై వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు టీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. ఈసీ అధికారులను కలిసిన వారిలో గులాబీ నేతలు విప్ బాల్కసుమన్, ఎంపీ రంజిత్ రెడ్డి, తెలంగాణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు.


Next Story

Most Viewed