ఎంపీ అరవింద్‎పై డీజీపీకి ఫిర్యాదు

by Shyam |   (  Updated:2020-11-24 21:33:09  IST  )

<p>దిశ, క్రైమ్ బ్యూరో: నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించడంపై బీజేపీ ఎంపీ అర్వింద్‎పై చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ కార్యదర్శి తాతా మధుసూదన్ రావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అనుమతి ప్రకారమే టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో ఎంపీ అర్వింద్‎,ఆయన అనుచరులు కేబీఆర్ పార్క్ రోడ్డులోని ఫ్లెక్సీలను చించివేశారన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాతా మధుసూదన్ రావు మంగళవారం [&hellip;]</p>

ఎంపీ అరవింద్‎పై డీజీపీకి ఫిర్యాదు
X

దిశ, క్రైమ్ బ్యూరో: నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించడంపై బీజేపీ ఎంపీ అర్వింద్‎పై చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ కార్యదర్శి తాతా మధుసూదన్ రావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అనుమతి ప్రకారమే టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో ఎంపీ అర్వింద్‎,ఆయన అనుచరులు కేబీఆర్ పార్క్ రోడ్డులోని ఫ్లెక్సీలను చించివేశారన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాతా మధుసూదన్ రావు మంగళవారం డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

Next Story