హుజురాబాద్‌ టీఆర్‌ఎస్‌లో జోష్.. సంబరాల్లో నేతలు

by  |
హుజురాబాద్‌ టీఆర్‌ఎస్‌లో జోష్.. సంబరాల్లో నేతలు
X

దిశ, కమలాపూర్: హుజరాబాద్ నియోజకవర్గానికి దళిత బంధు పథకం కార్యక్రమానికి 500 కోట్ల రూపాయలు బడ్జెట్ ను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయంకు సంతోషం వ్యక్తం చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సోమవారం టీఆర్‌ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు పాలాభిషేకం చేసిన అనంతరం ఎమ్మెల్యే బాల్క సుమన్ టపాసులు కాల్చారు. అనంతరం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద మొత్తంలో సంబరాలు చేసుకున్నారు.


Next Story