రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన టీఆర్ఎస్ నేతలు.. ఎందుకంటే..?

by  |
రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన టీఆర్ఎస్ నేతలు.. ఎందుకంటే..?
X

దిశ,రేగొండ: భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డిపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా శుక్రవారం రేగొండ మండల కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నేతలు దహనం చేశారు. అనంతరం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రేగొండ మండల అధ్యక్షులు అంకం రాజేందర్ , గోరి కొత్తపల్లి మండల అధ్యక్షులు, రేగొండ టీఆర్ఎస్ మహిళా మండల అధ్యక్షురాలు పాడి సబిత, టీఆర్ఎస్ మండల నాయకులు మోడెం ఉమేష్, సాయిని ముత్యం, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సామల పాపి రెడ్డి, కొడవటంచ ఆలయ చైర్మన్ హింగే మహేందర్,పున్నం రవి, మైస బిక్షపతి, కోలేపాక బిక్షపతి, యూత్ మండల అధ్యక్షులు పేరాల ప్రశాంత్, గ్రామ యూత్ అధ్యక్షుడు మడగాని నరేష్, యంజాల బిక్షపతి,గంజి రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Next Story