- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- రాశిఫలాలు
- ఫోటోలు
- ఆరోగ్యం
దిశ, జమ్మికుంట : హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రస్తుతం అక్కడ కేంద్ర బలగాలు పహారా కాస్తుండగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ లీడర్లు బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. జమ్మికుంట పట్టణ పరిధిలోని మేదరివాడకు చెందిన శివ అనే బీజేపీ కార్యకర్తపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేయగా బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
బాధితుని కథనం మేరకు.. శివ అనే వ్యక్తి వరంగల్ నుంచి వచ్చిన బీజేపీ నేతలతో కలిసి మేదరి వాడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావుతో పాటు మరికొంత మంది అడ్డుకుని ప్రచారం చేయొద్దంటూ వారి సెల్ఫోన్లు గుంజుకొని తీవ్ర పదజాలంతో దూషించారు. అంతటితో ఆగకుండా వారిపై దాడికి పాల్పడినట్టు వెల్లడించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించినట్టు బాధితుడు పేర్కొన్నాడు. కాగా, ఓటమి భయంతోనే టీఆర్ఎస్ పార్టీ లీడర్లు తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.