- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఖానాపూర్: పండించిన ధాన్యాన్ని ఒక్కగింజ కూడా వదలకుండా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అనవసరంగా ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తు్న్నాయని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రాం నర్సయ్య అన్నారు. ఓ.డి.సి.ఎం.ఎస్ ఛైర్మెన్ రామస్వామి మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కాంగ్రెస్ హయాంలో కంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టామని అన్నారు. 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ లో 6 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల గోదాముల అందుబాటులో ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 14 లక్షలకు పెంచిందని అన్నారు.
రాష్ట్రంలోనే ఉత్తమ సొసైటీ గా అవార్డు తీసుకున్న ఖానాపూర్ సొసైటీని అప్రతిష్ట పాలు చేయడం ప్రతిపక్షాలకు సిగ్గు చేటని విమర్శించారు. ప్రతిపక్షాలు అవకాశవాద రాజకీయాలు చేసి రైతులని ఆందోళనకి గురి చేస్తున్నాయని విమర్శించారు. రైతులు పంట కోనుగోలుకు సంబంధించి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. 18 కొనుగోలు కేంద్రాలలో ,బస్తాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్ రావు,రైతు బంధు కన్వీనర్ కుంచారపు వెంకట్ రెడ్డి,సొసైటీ వైస్ చైర్మన్ వేణు కృష్ణ,డైరెక్టర్ అబోతు అశోక్ తదితరులు పాల్గొన్నారు.