బీజేపీ, కాంగ్రెస్‌కు ఎజెండాలు దొరకట్లేదు !

by  |
బీజేపీ, కాంగ్రెస్‌కు ఎజెండాలు దొరకట్లేదు !
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎజెండాలు దొరక్క అనవసరైమన విషయాలను చర్చలకు తీసుకువస్తున్నాయని టీఆర్ఎస్ నేత వినోద్‌కుమార్ వ్యాఖ్యానించారు. రైతులు, కార్మికుల పట్ల మోడీ సర్కార్ వైఖరి సరిగా లేదని మండిపడ్డారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీలోని మెజార్టీ షేర్లు విక్రయించేందుకు కేంద్ర చర్యలు చేపట్టడం బాధాకరమన్న ఆయన.. దేశంలో రైతులు, కార్మిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందన్నారు. నిజమైన దేశభక్తులు దేశానికి అన్నం పెట్టే రైతులని, బీజేపీ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో వినోద్‌కుమార్ పై వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed