- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కంటోన్మెంట్: పర్యావరణ పరిరక్షణ కోసం విత్తన గణపతులను పూజిద్దామని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం బోయిన్పల్లిలోని తన నివాసంలో కంటోన్మెంట్ బోర్డు సభ్యులు, కార్పొరేటర్లకు విత్తన గణేష్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛమైన మట్టిలో వేప విత్తనాన్ని కలిపి గణపతిని తయారు చేసి పంపిణీ చేయటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. రోజువారీ పూజలు అందుకునే ఈ గణేశునిలోని విత్తనం ఐదు నుంచి ఏడు రోజుల్లో మొలకెత్తుతుందన్నారు. ఇంట్లోనే విగ్రహ నిమజ్జనం తర్వాత వేప మొక్కను ఇంటి ఆవరణలోనే నాటుకోవచ్చనని తెలిపారు.
Next Story