విత్తన గణేష్‌ను పూజిద్దాం:మర్రి రాజశేఖర్‌రెడ్డి

by  |
విత్తన గణేష్‌ను పూజిద్దాం:మర్రి రాజశేఖర్‌రెడ్డి
X

దిశ, కంటోన్మెంట్: పర్యావరణ పరిరక్షణ కోసం విత్తన గణపతులను పూజిద్దామని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం బోయిన్‌పల్లిలోని తన నివాసంలో కంటోన్మెంట్ బోర్డు సభ్యులు, కార్పొరేటర్లకు విత్తన గణేష్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛమైన మట్టిలో వేప విత్తనాన్ని కలిపి గణపతిని తయారు చేసి పంపిణీ చేయటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. రోజువారీ పూజలు అందుకునే ఈ గణేశునిలోని విత్తనం ఐదు నుంచి ఏడు రోజుల్లో మొలకెత్తుతుందన్నారు. ఇంట్లోనే విగ్రహ నిమజ్జనం తర్వాత వేప మొక్కను ఇంటి ఆవరణలోనే నాటుకోవచ్చనని తెలిపారు.


Next Story

Most Viewed