అనాథలను ఆదరించడమే మానవీయత: మురళీధర్ రెడ్డి

by  |
అనాథలను ఆదరించడమే మానవీయత: మురళీధర్ రెడ్డి
X

దిశ,మహబూబాబాద్ టౌన్: అనాథలను ఆదరించడం నేటి సమాజంలో మానవీయకు అద్దం పడుతోందని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం రామచంద్రపురం కాలనీలోని దైవకృప చిన్నారుల అనాథాశ్రమంలో అమెరికాలోని తన మేనల్లుడి పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. అనాథ పిల్లలకు నెలకు సరిపడా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి అనాథ ఆశ్రమాన్ని నిర్వహించడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. చిన్నారులను తన సొంత పిల్లలుగా చూస్తూ, వారికి ప్రేమ, ఆప్యాయతలను పంచడం ప్రశంశనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో దైవ కృప అనాథ ఆశ్రమం నిర్వాహకుడు బాణోత్ లోకేష్ నాయక్ , రాధిక, సుశీల, వంశీ, నగేష్ లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed