- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ కుటుంబం నెలకు రూ.15లక్షల జీతం తీసుకుంటోందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. జీతం తీసుకుంటూ కనీసం సెక్రటరియేట్కు వెళ్ళని సీఎం.. దేశానికి దశ దిశ నిర్దేశం చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్తో టీఆర్ఎస్కు ఓటు వేశారని, ఇప్పుడు మీ మోసాన్ని గ్రహించిన ప్రజలు మీకు ఓటేసే ప్రసక్తిలేదన్నారు. టీఆర్ఎస్.. సోమరిపోతులు, కమెడియన్ల పార్టీ అని విమర్శించిన ఎంపీ అరవింద్.. బ్రహ్మానందంతో కేసీఆర్, బాబుమోహన్తో కేటీఆర్ పోటీపడుతున్నారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మేయర్ సీటు సాధిస్తే వరద బాధితులకు రూ.25వేల సాయం చేస్తామని స్పష్టం చేశారు.
Next Story