అసెంబ్లీ సీట్లపై కేంద్రానికి టీఆర్ఎస్ కీలక వినతి

by  |
Vinod kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో : జమ్మూ, కశ్మీర్ సహా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్రాన్ని కోరారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు కోసం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సాగుతోందని పేర్కొనడంపై ఆయన స్పందించారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒకే దేశం, ఒకే చట్టం నినాదాన్ని తెలుగు రాష్ట్రాల్లోనూ వర్తింపజేయాలని, అసెంబ్లీ సీట్లు తక్షణమే పెంచాలని కోరారు.


Next Story

Most Viewed