వారిని తెరాస విస్మరిస్తోంది: బండి సంజయ్

by  |
వారిని తెరాస విస్మరిస్తోంది: బండి సంజయ్
X

దిశ,వెబ్ డెస్క్: రేపు ఉదయం 11గంటలకు విజయ శాంతి భాజపాలో చేరుతారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఫలితాలపై రాష్ట్ర నేతలను అమిత్ షా అభినందించారని చెప్పారు. ప్రతి ఎన్నికల్లో ఇదే దూకుడుతో వెళ్లాలని అమిత్ షా సూచించారని పేర్కొన్నారు. తెరాస ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు. తెలంగాణ అసలైన ఉద్యమకారులను తెరాస విస్మరిస్తోందని అన్నారు. తెరాస వైఖరితో అసలైన ఉద్యమకారులు తమ పార్టీలోకి వస్తున్నారని వివరించారు.

Next Story

Most Viewed