టీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తోంది: సంపత్

by  |
ZP-Chairmen1
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించి వారి ఆర్ధిక అభివృద్ధికి కృషి చేస్తుందని జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరం రిజర్వాయర్ లో స్థానిక ఎమ్మెల్యే డా. టి. రాజయ్యతో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోని కులవృత్తులను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడమే కాకుండా వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరిత-బాలరాజు, సర్పంచ్ తిరుమల-క్రిష్ణ మొహన్ రెడ్డి, ఎంపీటీసీ లలిత-శ్యామ్ కుమార్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ నాయక్, జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ పిట్టల సత్యనారాయణ, డీఎఫ్ఓ శ్రీపతి నాయకులు మహేందర్, రంగు రవి, శ్రీనివాస్, మల్లయ్య, సోషల్ మీడియా ఇన్ చార్జ్ రంగు రమేష్, మత్స్య శాఖ చైర్మన్ ఈర్ల సమ్మయ్య కార్యదర్శి, కనకరాజు ఉపాధ్యక్షులు ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story