రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా టీఆర్ఎస్ జెండా పండుగ

by  |
TRS Flag Festival
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు, జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ జెండా ఎగరవేశారు. అనంతరం వారు కమిటీల నియామకానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ భవన్‌‌లో టీఆర్‌ఎస్‌ నేత పర్యాద కృష్ణమూర్తి గులాబీ జెండాను ఎగుర వేశారు. హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు.

అదేవిధంగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన జెండా పండుగలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సంగారెడ్డిలో జరిగిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, నర్సంపేట పట్టణంలో టీఆర్ఎస్ జెండాను స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎగురవేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రతీక్షణం ప్రజాహితం కోసం పరితపించే వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పల్లెపల్లెనా, పట్టణాల్లో వార్డు వార్డునా టీఆర్‌ఎస్‌ నేతలు గులాబీ జెండాను ఎగుర వేసి జెండాపండుగను ఘనంగా నిర్వహించారు.


Next Story

Most Viewed