- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, గద్వాల : గద్వాల పట్టణ టీఆర్ఎస్ పార్టీ 20వ వార్డ్ కౌన్సిలర్ మహేశ్వరి దంపతులు తమ వార్డ్లో పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన విద్యుత్ పనులను సంవత్సరం కూడా చేయకపోవడంపై నిరసన తెలియజేశారు. నిరసనగా విద్యుత్ కార్యాలయం ఎదుట మండు టెండలో గేట్ ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా కౌన్సిలర్ మహేశ్వరి మాట్లాడుతూ.. గత సంవత్సరం పట్టణ ప్రగతిలో తమ వార్డ్లో చేపట్టాల్సిన నూతన పోల్స్ నిర్మాణం, అదేవిధంగా లైన్ల మార్పు పనులను విద్యుత్ అధికారులు చేపట్టలేదని తెలిపారు. అధికార పార్టీ చెందిన మాకే వార్డ్లో పనులు కాకపోతే సామాన్యుల ప్రజల పనులు ఏవిధంగా చేస్తారో అర్థం చేసుకోవాలని తెలిపారు.
ఎన్ని సార్లు విద్యుత్ అధికారులకు వార్డ్ సమస్యలను విన్నవించినా అధికారులు మాత్రం పనులు చేపట్టలేదని.. అందుకే తాము నిరసనగా ఎండలో గేట్ ముందు నిరసన చేపట్టామని తెలిపారు. గంటకు పైగా ఎండలో కూర్చుంటే కనీసం అధికారులు వచ్చి పలకరించలేదని వారు తెలిపారు.