టీఆర్‌ఎస్‌దే ఆధిక్యం

by  |
టీఆర్‌ఎస్‌దే ఆధిక్యం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‎నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఐదో రౌండ్‎లో టీఆర్ఎస్‌ అభ్యర్థి వాణీదేవి 6,555 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇప్పటివరకు టీఆర్ఎస్‌ అభ్యర్థి వాణీదేవికి 88,304 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 81,749 ఓట్లు వచ్చాయి.

ఇక ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‎కు 42,604 ఓట్లు వచ్చాయి. అటు కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 24,440 ఓట్లు వచ్చాయి. 5 రౌండ్లు పూర్తయ్యేసరికి 16,712 చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు.


Next Story

Most Viewed