రణ్‌బీర్‌‌‌ సరసన చాన్స్ కొట్టేసిన ‘తృప్తి’

by  |
రణ్‌బీర్‌‌‌ సరసన చాన్స్ కొట్టేసిన ‘తృప్తి’
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ కానుకగా.. బాలీవుడ్‌లో తన రెండో ప్రాజెక్ట్ ‘యానిమల్’ టైటిల్‌తో పాటు రణ్‌బీర్ కపూర్ వాయిస్ ఓవర్‌తో విడుదల చేసిన స్నీక్ పిక్ సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే అనిల్ కపూర్, బాబీ డియోల్‌ కీ రోల్స్ పోషిస్తుండగా, రణ్‌బీర్‌తో చార్మింగ్ బ్యూటీ పరిణీతి చోప్రా రొమాన్స్ చేయనుంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండగా.. ఆ క్రేజీ చాన్స్‌ను యంగ్ యాక్ట్రెస్ తృప్తి దిమ్రీ దక్కించుకుంది.

‘యానిమల్’ సెకండ్ హీరోయిన్ కోసం సారా అలీ ఖాన్‌తో పాటు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్లను ఆడిషన్ చేయగా.. తృప్తి దిమ్రీ నటన, వర్క్‌తో ఇంప్రెస్ అయిన మూవీ యూనిట్ ఆమెను ఫైనల్ చేసినట్లు సమాచారం. యానిమల్‌లోని పాత్రకు ఆమె అయితే ఫ్రెష్‌నెస్‌ తీసుకురావడంతో పాటు యంగ్ అప్పీల్ ఉంటుందని మేకర్స్ భావించగా, తృప్తి తన టాలెంట్ చూపించుకోవడానికి ఇదో పెద్ద అవకాశమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పరిణీతి- రణ్‌బీర్, అనిల్ కపూర్- రణ్‌బీర్‌ల ద్వయం కూడా తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనుండటం విశేషం.

చిన్నప్పటి నుంచే యాక్టింగ్‌ అంటే ఎంతో ఇష్టపడే తృప్తి.. చైల్డ్‌హుడ్ నుంచే యాడ్స్‌లో మెరిసి, ఆ తర్వాత మోడలింగ్‌లో రాణించింది. ఆ క్రమంలోనే 2017లో ‘పోస్టర్‌ బాయ్స్’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత సాజిద్‌ అలీ దర్శకత్వంలో ‘లైలామజ్ను’లో హీరోయిన్‌గా అవకాశాన్ని దక్కించుకున్న తృప్తి.. చివరగా నెట్‌ఫ్లిక్స్ ఒరిజనల్ ‘బుల్ బుల్’లో నటించింది. ఈ సినిమాలోని నటనకు గాను తృప్తి ఉత్తమ నటిగా తొలి ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్ కూడా అందుకోవడం విశేషం.


Next Story

Most Viewed