సీనియర్ నేత మృతి.. సంతాపం తెలిపిన సీఎం

by  |
సీనియర్ నేత మృతి.. సంతాపం తెలిపిన సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్ : తృణమూల్ కాంగ్రెస్‌లో విషాదం చోటు చేసుకుంది. ప‌శ్చిమ బెంగాల్ పంచాయ‌తీ శాఖ మంత్రి , తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత సుబ్రతా ముఖ‌ర్జీ (75) గురువారం రాత్రి క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన.. కోల్‌క‌తాలోని ఎస్ఎస్‌కేఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖ‌ర్జీ మృతి ప‌ట్ల బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సంతాపం ప్రక‌టించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖర్జీ మ‌ర‌ణం త‌మ ప్రభుత్వానికి, త‌మ పార్టీ‌కి తీర‌ని లోట‌ని, త‌మ మిత్రుడు లేరు అనే వార్త జీర్ణం అవ‌డం లేద‌ని వాపోయారు. అలాగే ర‌వీంద్ర స‌ద‌న్లో శుక్రవారం ఉద‌యం ముఖ‌ర్జీ అంత్యక్రియ‌లు నిర్వహించ‌నున్నట్లు సీఎం మ‌మ‌త తెలిపారు.

Next Story