- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ శంషాబాద్: దేశం ఓ గొప్ప సైనికుని కోల్పోయిందని శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మెన్ బండి గోపాల్ యాదవ్ అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆత్మకు శాంతి చేకూరాలని శంషాబాద్ అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిపిన్ రావత్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. నాలుగు దశాబ్దాల పాటు మాతృభూమికి నిస్వార్ధంగా సేవలందించిన గొప్ప వీరుని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు ఆంజనేయులు, జయంత్, రాము, వెంకటేష్, జంగయ్య, బంటి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.