- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మా బతుకులు ఆగం చేయొద్దు.. ఆదివాసీల గోడు
by Sridhar Babu |

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: అటవీశాఖ భూముల్లో ట్రెంచ్ కొడుతుండగా పోడు రైతులు అధికారులను అడ్డుకున్నారు. ఎన్నో ఏండ్లుగా తాము పోడు చేసుకుంటూ బతుకుతున్న మా భూముల్లో కందకాలు తీయొద్దని అధికారులను వేడుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముసలిమడుగు గ్రామంలోని గురువారం అటవీ భూముల్లో ట్రెంచ్ ఏర్పాటు చేసేందుకు అటవీ అధికారులు ఎక్స్కవేటర్తో వెళ్లారు. ఎక్స్కవేటర్తో ట్రెంచ్ కొడుతుండగా ఆదివాసీలు అక్కడికి చేరుకుని పనులను అడ్డగించారు. వాహనాలకు అడ్డంగా పడుకుని పనుల నిర్వహణను అడ్డుకున్నారు. ‘తమ ప్రాణాలైనా ఇస్తాం గాని, మా బతుకును ఆగం చేసే ఈ పనులకు మేము ఒప్పుకోం’ అంటూ తెగేసి చెప్పారు. చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.
Next Story