అక్కడి వారికి స్మశానమే ఐసోలేషన్

by  |
అక్కడి వారికి స్మశానమే ఐసోలేషన్
X

దిశ,వెబ్‌డెస్క్ : కరోనా సోకిందని ఓ గ్రామంలోని ప్రజలందరూ స్మశానంలో ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా అశ్వరావు పేట మొద్దులమడ అనే గిరిజన గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గిరిజిన తండాలో మొత్తం 150 మంది జనాభా ఉండగా అందులో 50 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా వారి కుటుంబసభ్యులకు సోక కుండా ఉండడానికి వారు తమ ఊరికి దూరంగాఉన్న స్మశానాన్నే ఐసోలేషన్‌ కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఊరిలో ప్రతీ కుటుంబంలోని ఒక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో. దీంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.


Next Story