ఆరు నెలల పాపతో ఒంటరిగా ఉంటోన్న కోడలు.. మామ ఏం చేశాడో తెలుసా?

by Gantepaka Srikanth |
ఆరు నెలల పాపతో ఒంటరిగా ఉంటోన్న కోడలు.. మామ ఏం చేశాడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: కన్న కూతురి పెళ్లి చేయకుండా ఎలా తప్పించుకోవాలా? అని తండ్రులు చూస్తున్న ఈ రోజుల్లో.. కోడలి(Daughter-in-Law) పెళ్లి చేసి ఓ మామ అందరినీ కంటతడి పెట్టించాడు. ఈ ఘటన గుజరాత్‌(Gujarat)లోని అంబాజీ టౌన్‌(Ambaji Town)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంబాజీ టౌన్‌కు చెందిన ప్రవీణ్ సింగ్ రాణా(Praveen Singh Rana) అనే వ్యక్తి ఏడాదిన్నర క్రితం తన కొడుకుకు అత్యంత గ్రాండ్‌గా వివాహం చేశారు. అయితే.. ఇటీవల అతని కొడుకు గుండెపోటుతో మరణించాడు. ఆరు నెలల పసిపాపతో కోడలు ఒంటరిగా గడుపుతోంది. దీంతో ఆమె బాధను చూసి చలించిపోయిన మామ.. స్వయంగా కొడుకు స్నేహితుడికి ఇచ్చి మళ్లీ అత్యంత గ్రాండ్‌గా వివాహం జరిపించాడు. కన్నీటితో తన కోడలిని అత్తగారింటికి సాగనంపాడు. దీంతో చూసిన స్థానికులు ప్రవీణ్ సింగ్ రాణాతో పాటు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రవీణ్ సింగ్ రాణాను ప్రశంసలతో ముంచెత్తారు.

కాగా, ఎక్కడైనా పెళ్లి తర్వాత వరుడు చనిపోతే.. వధువును నిందిస్తుంటారు. ఆమె అడుగుపెట్టగానే మా పిల్లోడు చనిపోయాడంటూ ఐరన్ లెగ్‌తో పోల్చి అవమానిస్తుంటారు. ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి పంపిచేద్దామా? అని ప్లాన్ చేస్తుంటారు. నిత్యం వేధింపులు, గొడవలతో టార్చర్ చేస్తుంటారు. కానీ.. ఇక్కడ అలా చేయకుండా.. కన్న కూతురి మాదిరిగా సాగనంపిన తీరు అందరినీ కలిచివేసింది. ఇది కాస్త అక్కడికి వెళ్లి బంధువులు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో అందరు మామలూ ప్రవీణ్ సింగ్ రాణాలా ఆలోచించాలని నెటిజన్లు సూచనలు చేస్తున్నారు.



Next Story

Most Viewed