ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు గ్లోబల్ స్టార్స్.. షేక్ అవుతున్న ట్విట్టర్

by Disha Web Desk 1 |
ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు గ్లోబల్ స్టార్స్.. షేక్ అవుతున్న ట్విట్టర్
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా మనకు నచ్చిన ఇద్దరు వ్యక్తులను ఒకే ఫ్రేమ్‌లో చూస్తే ఆనందం అంతా.. ఇంతా కాదు. కానీ, మనకి నచ్చిన హీరో, మన ఫేవరెట్ క్రికెటర్ ఒకే ఫ్రేమ్‌లో ఫోజులిస్తే.. ఆ ఫొటో ఇక ట్రెండ్ అవ్వాల్సిందే. సరిగ్గా ఇవ్వాళ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు గ్లోబర్ స్టార్లు దర్శనమిచ్చారు. ఒక యాడ్ షూట్ లో భాగంగా.. ఇండియన్ క్రికెట్ ప్రైడ్, భారత జట్టు మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని, గ్లోబర్ స్టార్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. శివ చెర్రీ అనే రాంచరణ్ అభిమాని ఈ ఫొటోలను ట్విట్టర్ లో ఫోస్ట్ చేసి క్రేజీ క్యాప్షన్ ఇచ్చారు. 'రోజులు మారాయి, సంత్సరాలు గడిచాయి. ఇప్పుడు ఇద్దరు అత్యుత్తమ గ్లోబల్ స్టార్లుగా ఎదిగినా వారి మధ్య స్నేహం నేటికి పట్టిష్టంగా ఉంది'. అని శివ చెర్రీ తన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు.

Read More: నా జీవితానికి నువ్వే వెలుగు.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్

Next Story