పెళ్లి నుంచి పారిపోయిన వధువు.. 13 రోజుల పాటు అదే మండపంలో వరుడు ఏం చేశాడంటే..?

by Disha Web Desk 7 |
పెళ్లి నుంచి పారిపోయిన వధువు.. 13 రోజుల పాటు అదే మండపంలో వరుడు ఏం చేశాడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎవరితో ఎవరికి పెళ్లి జరగాలి అనేది దేవుడు ముందే నిర్ణయిస్తాడు అంటారు. కొన్ని సంఘటనలు చూస్తే మనం కూడా వాటిని నమ్మక తప్పదు. ఎందుకంటే పెళ్లి వరకు వచ్చిన చాలా పెళ్లిళ్లు మండపంలోనే ఆగిపోతాయి. తాజాగా ఓ పెళ్లిలో కూడా అదే జరిగింది. కొద్ది సేపటిలో పెళ్లి అనగా మండపం నుంచి పారిపోయింది వధువు. అప్పుడు వరుడు ఏం చేశాడంటే..

రాజస్థాన్ పాలీ జిల్లా సౌణా గ్రామానికి చెందిన మనీషా అనే యువతికి పెళ్లి నిశ్చయమైంది. కొద్ది సేపటిలో పెళ్లి అనగా.. వివాహం ఇష్టం లేని వధువు కడుపు నొప్పి వస్తుందంటూ బంధువులను తీసుకుని మండపం నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమెపై మనసు పడ్డ వరుడు దాదాపు 13 రోజుల పాటు వధువు కోసం మండపంలోనే ఎదురు చూశాడు. చివరికి వధువుని పెళ్లికి ఒప్పించి మండపానికి తీసుకొచ్చి పెళ్లి చేశారు. దీంతో కథ సుఖాంతం అయింది.


Next Story

Most Viewed