ఊళ్లోకొచ్చిన సింహాలకు చుక్కలు చూపించిన ఎద్దు

by Disha Web Desk 12 |
ఊళ్లోకొచ్చిన సింహాలకు చుక్కలు చూపించిన ఎద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: సాధరణంగా అడవిలో అయిన, గ్రామాల్లో అయిన.. సింహాన్ని చూస్తే ఏ ప్రాణికైనా వణుకు పుట్టాల్సిందే. ఎందుకంటే సింహం పంజా బలం అలాంటిది కాబట్టి. కానీ దీనికి విరుద్ధంగా ఓ ఎద్దు సింహాలను నడిరోడ్డుపై తరిమి తరిమి అక్కడి నుంచి పంపింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో అటవి సమీపంలో ఉన్న ఊరులోకి ఐదు సింహాలు రాగా వాటిని ఓ ఎద్దు తరమడం కనిపించింది.

ఈ విచిత్ర సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్‌లో చోటు చేసుకుంది. ఊళ్లోకి వచ్చిన సింహాలను ఎద్దు ఉరికించిన ఈ సంఘటన మొత్తం.. అక్కడున్న ఓ వ్యక్తి తన ఫోన్ కెమెరాలో రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. ఐదు సింహాలను ఒక ఎద్దు ఉరికించడంతో అంతా షాక్ అవ్వడమే కాకుండా తెగ లైకులు షేర్లు చేస్తూ.. ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.


Next Story