Viral News: రంజాన్ బంపర్ ఆఫర్.. ఈ హోటల్‌లో అన్నీ ఉచితమే.. ఎక్కడంటే..?

by Disha Web Desk 3 |
Viral News: రంజాన్ బంపర్ ఆఫర్.. ఈ హోటల్‌లో అన్నీ ఉచితమే.. ఎక్కడంటే..?
X

దిశ వెబ్ డెస్క్: సాధారణంగా పండగల్లో హోటల్ రూమ్ ధరలు తార స్థాయికి చేరుతాయి. కొంతమంది కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్‌లను పెడతారు. అయితే ఏ వ్యాపారి ఉచితంగా ఏదీ ఇవ్వరు. కానీ ఓ వ్యక్తి మాత్రం రంజాన్ మాసంలో తన హోటల్‌కి వెళ్లిన వాళ్లకు ఉచితంగా వసతి కల్పించడమే కాదు, భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు చాల ప్రాముఖ్యత ఉంది. ఇక రంజాన్ మాసంలో ఈ దర్గా దగ్గరకు వచ్చే భక్తులు దగ్గర్లోని హోటల్లల్లో రూమ్ తీసుకునే స్తోమత లేక దర్గాలో పూజలు చేసుకుని, దర్గా బయట పడుకునే వాళ్ళు. ఇది చూసి ఓ వ్యక్తి మనసు చెలించింది. వెంటనే తన కోడుకు ఆధిత్యను పిలిచి విషయం చెప్పారు. అప్పటికే ఆధిత్య త్రీ స్టార్ హోటల్ నడుపుతున్నారు.

తండ్రి మాటను గౌరవించి అప్పటి నుండి రంజాన్ మాసంలో దర్గాకు వచ్చే ప్రతి ఒక్కరికి తన హోటల్‌లో ఉచితంగా రూమ్‌లు ఇస్తున్నారు. అలానే వాళ్లకు ఇఫ్తార్ విందు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తన హోటల్‌లో బస చేసిన వారికి పండ్లు, ఖర్జూరం, డ్రై ఫ్రూప్ట్స్ అందిస్తారు. ఒకవేళ తన హోటల్‌ల్లో గదులు ఖాళీ లేకపోతే వారికి తన సొంత ఖర్చులతో వేరే చోట వసతులు ఏర్పాటు చేస్తున్నారు.

ఇలా ఆధిత్య గత 8 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇక ఆ దర్గాకు ముస్లింలతో పాటు హిందువులు కూడా వస్తారు. కాగా ఆధిత్య మతబేధం లేకుండా దర్గాకు వచ్చిన ప్రతి ఒక్కరికి వసతులు కల్పించి, దారి ఖర్చులు కూడా ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12 నెలలు నా హోటల్ బాగా నడుస్తుంది. నాకు లాభాలు తెచ్చి పెడుతోంది.

అలాంటిది ఒక్క నెల లాభాన్ని ప్రజల కోసం వినియోగిస్తే ఏమవుతుంది..? నలుగురికి సాయం చెయ్యడం కంటే సంతోషం ఏముంది అని పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది కూడా ఆధిత్య ఈ సేవలను కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా తన హోటల్‌కి వచ్చే వారి కోసం ఐపీల్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు.



Next Story

Most Viewed