- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోటిన్నరతో తోబుట్టువు ఒడి నింపిన సోదరులు
రాజస్థానీ మాయ్రా సంప్రదాయం గురించి విన్నారా? తోబుట్టువు పిల్లల పెళ్లి సందర్భంగా.. సోదరులు సోదరికి పెద్ద మొత్తంలో బహుమతులు ఇచ్చే ఆనవాయితీ ఇది. తాజాగా బికనీర్ జిల్లా సీనియాలా గ్రామంలో

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థానీ మాయ్రా సంప్రదాయం గురించి విన్నారా? తోబుట్టువు పిల్లల పెళ్లి సందర్భంగా.. సోదరులు సోదరికి పెద్ద మొత్తంలో బహుమతులు ఇచ్చే ఆనవాయితీ ఇది. తాజాగా బికనీర్ జిల్లా సీనియాలా గ్రామంలో మాయ్రా పెద్ద మొత్తంలో అందుకుంది ఓ సోదరి. తన కొడుకుల పెళ్లి సందర్భంగా.. ఇద్దరు అన్నాదమ్ములు కలిసి ఏకంగా కోటిన్నరతో సోదరి ఒడి నింపారు.
భవరర్ లాల్ లేఘా, జగదీష్ లేఘా విజయవంతమైన వ్యాపారులు. కాగా ఇది వారికి మొదటి మాయ్రా. దీంతో ఈ సంప్రదాయంలో ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేలా ఏకంగా రూ. 1.56 కోట్ల బహుమతులు అందించారు. రాజస్థాన్ చరిత్రలో అత్యంత ఖరీదైన మాయ్రాగా వర్ణించబడుతున్న ఈ ఘటన.. అతిథులను ఆశ్చర్యపరిచింది. 31 తులాల బంగారం, 1.25 కిలోల వెండి వస్తువులతో కలిపి ఈ మాయ్రాను ఘనంగా అందించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగౌర్ MP హనుమాన్ బెనివాల్ హాజరయ్యారు.






