ఒకే ఫ్రేమ్‌లో పవన్, విజయ్, అజిత్, మహేశ్ బాబు.. ఫ్యాన్స్ హ్యాపీ!

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-25 08:53:39  IST  )

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత అందుబాటులోకి వచ్చాక నెటిజన్ల క్రియేటివిటీకి హద్దులే లేకుండా పోతోంది.

ఒకే ఫ్రేమ్‌లో పవన్, విజయ్, అజిత్, మహేశ్ బాబు.. ఫ్యాన్స్ హ్యాపీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత అందుబాటులోకి వచ్చాక నెటిజన్ల క్రియేటివిటీకి హద్దులే లేకుండా పోతోంది. తమ ఊహల్లోని అద్భుతమైన విజువల్స్‌ను ఏఐ సాయంతో క్షణాల్లో క్రియేట్ చేస్తూ సోషల్ మీడియా వేదికలపై ట్రెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా, రాజకీయ ప్రముఖులపై క్రియేట్ చేస్తున్న ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఏఐ ఫొటో సౌత్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఈ నలుగురు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది? అనే ఊహకు ఒక నెటిజన్ ఏఐ ద్వారా ప్రాణం పోశాడు.

మైదానంలో ముచ్చట్లు..

ఒక పెద్ద స్పోర్ట్స్ స్టేడియం (మైదానం) బ్యాక్రాప్లో, ఈ నలుగురు స్టార్స్ క్రీడా దుస్తులు (స్పోర్ట్స్ జెర్సీలు) ధరించి, ఎంతో స్నేహపూర్వకంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నవ్వులు చిందిస్తున్నట్లు ఈ ఫొటోను చాలా సహజంగా, అద్భుతంగా డిజైన్ చేశారు. నిజ జీవితంలో ఈ నలుగురు అగ్ర నేతలు, హీరోలు ఒకే వేదికపై కలవడం చాలా అరుదు. అలాంటిది వీరందరినీ ఒకే ఫ్రేమ్‌లో, అది కూడా ఎంతో ఎనర్జిటిక్ లుక్‌లో చూసేసరికి నలుగురు హీరోల అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. "ఈ ఒక్క ఫొటో చూస్తే చాలు.. మా కడుపు నిండిపోయింది" అంటూ ఫ్యాన్స్. నెటిజన్లు ఈ విజువల్స్‌కు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఏఐ ఫొటో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో విపరీతంగా షేర్ అవుతూ హల్చల్ చేస్తోంది.

Next Story