- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
మాది కరాచీ కాదురా నాయనా.. ఇండియానే!

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. రెండు దేశాలు ప్రత్యేక్ష యుద్ధానికి దిగాయి. గురువారం రాత్రి నుంచి యుద్ధం కొనసాగుతోంది. దేశ సరిహద్దు నగరాలపై పాక్ (Pakistan) దాడులకు పాల్పడగా.. భారత ఆర్మీ (Indian Army) వాటిని విజయవంతంగా తిప్పికొట్టింది. అలాగే పాక్పై భారత్ ఎదురు దాడి (counter attack)కి దిగి.. ఇస్లామాబాద్, లాహోర్ నగరాలపై వైమానిక, మిసైల్స్ దాడులు చేసింది. పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీ ఎయిర్పోర్టు, పోర్టులను నేలమట్టం చేసింది. ఇదంతా దేశ సరిహద్దుల్లో పరిస్థితులు.. అయితే, ఇవే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సహా విదేశాల్లో సైతం ఫేమస్ అయినా 'కరాచీ బేకరీ' కొత్త కష్టం తెచ్చిపెట్టింది. తాము భారతీయులమే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు భారత్, పాక్ యుద్ధానికి, కరాచీ బేకరీ ఆందోళనకు ఏం సంబంధం తెలుసుకుందాం.
కరాచీ బేకరీ (Karachi Bekary).. ఉస్మానియా బిస్కెట్లకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది హైదరాబాద్ నగరంలోని సామాన్య ప్రజలలో టీ కేఫ్గా ఫేమస్. అయితే, కరాచీ పాకిస్థాన్లోని ప్రధాన నగరాల్లో ఒకటి. దీంతో భారత్, పాక్ మధ్య ఉద్రికత్తలు పెరిగినప్పుడల్లా ప్రజలు, ఆందోళనకారులు కరాచీ బేకరీలను లక్ష్యంగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనటంతో హైదరాబాద్లోని కరాచీ బేకరీ అన్ని బ్రాంచ్లపై త్రివర్ణ పతాకాలను ఎగురవేసింది యాజమాన్యం. అంతేకాదు, 'మమ్మల్ని భారతీయులుగానే గుర్తించండి' అంటూ కరాచీ బేకరీ చరిత్రను తెలియజేస్తూ యాజమాన్యం ప్రత్యేకంగా బోర్డులు పెట్టింది.
కాగా, 1947లో దేశ విభజన జరిగిన సమయంలో సింధీ హిందూ అయినా ఖాన్చంద్ రామ్నాని కరాచీ నుంచి హైదరాబాద్కు వలస వచ్చారు. ఆ తర్వాత 1953లో మొజాంజాహి మార్కెట్లోని సీనా బేకరీ పక్కన హైదరాబాదులో మొదటి కరాచీ బేకరీని ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో దాదాపు 20 బ్రాంచిలు ఉండగా.. దేశ, విదేశాల్లోనూ కరాచీ బేకరీకి బ్రాంచిలు ఉన్నాయి. అయితే, పహల్గాం ఉగ్ర దాడి తర్వాత కరాచీ బేకరి పేరు మార్చాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీంతో బేకరీ యాజమాన్యం బిక్కు బిక్కుమంటు గడపాల్సిన పరిస్థితి తలెత్తింది. కరాచీ బేకరీ ముందు బోర్డులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కరాచీ బేకరీ కుకీస్ 20కి పైగా దేశాలకు ఎగుమతి అవుతాయి. వీటిలో అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా ఉన్నాయి. అంతేకాదు, ఈ కంపెనీ ప్రతిరోజూ 10 టన్నులకు పైగా బిస్కెట్లను ఉత్పత్తి చేస్తుంది. హైదరాబాద్లో దాని ప్రతి స్టోర్లో సగటున రోజువారీ సందర్శకుల సంఖ్య 2000 వరకు ఉంటుంది.