Relationship: అబ్బాయిలు మీకే! పెళ్లికి ముందు అమ్మాయిలకు కావాల్సింది అదేనట? నెట్టింట వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-03-29 13:54:16  IST  )

చెన్నైకి చెందిన బిలీనియర్ ప్రసన్న శంకర్ నారాయణ వివాదం నెట్టింట చర్చానీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

Relationship: అబ్బాయిలు మీకే! పెళ్లికి ముందు అమ్మాయిలకు కావాల్సింది అదేనట? నెట్టింట వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: చెన్నైకి చెందిన బిలీనియర్ (Prasanna Sankar) ప్రసన్న శంకర్ నారాయణ వివాదం నెట్టింట చర్చానీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి భార్యా భాదితుల టాపిక్‌పై సమాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. తన భార్య అనూప్ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్లు భర్త ప్రసన్న శంకర్ కొన్ని ఆధారాలు చూపించడం వైరల్ అయింది. అందులో తన భార్య దివ్య అనూప్‌ అనే వ్యక్తి‌తో హోటల్ రూమ్ బుక్ చేసుకున్నట్లు ఉంది. భార్య చాట్‌లో ఎక్స్ఎల్ సైజ్ కండోమ్ కొనాలని ఉన్నట్లుగా తెలుస్తోంది. పురుషాంగం సైజు గురించి డిస్కస్ చేసినట్లుగా దివ్య చాట్ ఉంటుంది. ఈ వివరాలను అనూప్ భార్య తనకు పంపినట్లుగా ప్రసన్న ట్వీట్ వైరల్ అవుతోంది.

మహిళలు ఎవరిని కొరుకుంటున్నారు?

ప్రసన్న వివాదం నేపథ్యంలో నెట్టింట మహిళలు ఎవరని కోరుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇటీవల సంచలనం సృష్టించిన (Meerut Murder Case) మీరట్ హత్య కేసులో కూడా భార్య ముస్కాన్ అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను ప్రియుడితో అతి కిరాతకంగా హతమారుస్తుంది. ఈ విషయాలు అన్ని గుర్తుకు చేస్తూ నెటిజన్లు తాజాగా పోస్టులు పెడుతున్నారు. ముస్కాన్ భర్త ఎన్ఆర్ఐ, లండన్‌లో పనిచేస్తాడు. కానీ అతని భార్య డ్రగ్స్‌కు బానిస, జాబ్ లేని వ్యక్తిని ఇష్టపడింది. అలాగే కోట్ల ఆస్తిపరుడు అయిన ప్రసన్న శంకర్ నారాయణకి తన భార్య దివ్య విడాకులు ఇస్తోంది.. అనూప్ అనే వ్యక్తిని ఇష్టపడుతుంది.. అని ఓ నెటిజన్ ట్వీట్ ట్రెండ్ అవుతోంది. ‘మహిళలు నిజంగా ఏమి కోరుకుంటున్నారు? ధనవంతులైన పురుషులు? సక్సెస్ అయిన పురుషులు? చదువుకున్న పురుషులు? మంచిగా కనిపించే పురుషులు? లేదా డ్రగ్స్ బానిస, చప్రి బ్యాచ్, జాబ్ లేని వ్యక్తి?’ అని ట్వీట్ చేశారు. ఇందుకు ఓ నెటిజన్ అమ్మాయిలకు ఏం కావాలో తన అభిప్రాయం ట్వీట్ చేసింది.

‘మంచం ఎక్కితే మగాడిలా కాపురం చేసే మనిషి’

‘మంచం ఎక్కితే మగాడిలా కాపురం చేసే మనిషి’ అని ఓ బెబీ సినిమాలో నటి చెప్పే డైలాగ్‌ను గుర్తుకు చేసింది. అబ్బాయిలు పెళ్లికి ముందు డాక్టర్‌తో టెస్టోస్టెరాన్ (testosterone) చెక్ చేసుకోవాలని సూచనలు ఇచ్చింది ఓ నెటిజన్. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి చేసుకునే ముందు అబ్బాయిలు ఇవి గుర్తుంచుకోవాలని ట్వీట్స్ వైరల్ అవుతోంది. పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలకు ముందు డాక్టర్‌తో చెకప్ చేసుకున్న టెస్టోస్టెరాన్ సర్టిఫికెట్ ఉండాలని, ఐఐటీ, లాంటి చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు, డబ్బులు అవసరం లేదని, నేటి అమ్మాయిలకు కావాల్సింది సైజ్ మ్యాటర్ అని నెటిజన్లు ట్వీట్‌లు తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే ‘ప్రసన్న బిలియనీర్, 9/10 లుక్ ఉంటుంది. సంతోషకరమైన కుటుంబం, అయినప్పటికీ సైజు కారణంగా 2/10 మిడ్ లుకింగ్ ఉన్న భార్య చేత మోసపోయాడు.’ అని నెటిజన్ ట్వీట్ వైరల్ అవుతోంది. కాగా, కొన్ని సంఘటనలకు పట్టుకుని మొత్తం మహిళా సమాజాన్ని తప్పుపట్టడం కరెక్ట్ కాదని, చాలా మంది మహిళలు వేధింపులకు గురవుతున్నారని, బలవన్మరణాలకు పాల్పడుతున్నారని పలువురు నెటిజన్లు సానుకూలంగా ట్వీట్‌లు వేయడం గమనార్హం.

ఆ ఫొటోలు ఫేక్..

అయితే ప్రసన్న శంకర్ నారాయణ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న ఫొటోపై వివాదం నెలకొంది. ఆ ఫొటోలో ఉన్నది శంకర్ నారాయణ కాదని తేలింది. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి స్వయంగా స్పందించారు. టెక్ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్ నారాయణ, అతని భార్య దివ్య శశిధర్ మధ్య ఉన్న వివాదానికి తనను లింక్ చేస్తూ, తన ఫొటోలను సోషల్ మీడియాలో తప్పుగా ప్రసారం చేయడంపై అనూప్ కె ఎం అనే వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశాడు. వాళ్ల వివాదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన ప్రమేయం లేకుండా సోషల్ మీడియాలో ఇతరుల కేసులో నన్ను సంప్రదించకుండా నా ఫొటో వాడినందుకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అనూప్ కె ఎం వెల్లడించారు. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టుల్లో, తనపై వార్తలు వాసిన వాళ్లు వెంటనే తన ఫొటోలను తొలగించాలని కోరారు. లేకుంటే పరువు నష్టం కేసు నమోదు చేస్తానని హెచ్చరించారు.

Read More : Wedding Dates: పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఏప్రిల్ నెలలో మంచి ముహూర్తాలివే!

Next Story