Viral News: క్రికెటర్ కోహ్లీలా ఆలోచిస్తున్న యువత.. RBI మాజీ గవర్నర్..

by Disha Web Desk 3 |
Viral News: క్రికెటర్ కోహ్లీలా ఆలోచిస్తున్న యువత.. RBI మాజీ గవర్నర్..
X

దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం భారత దేశంలోని యువత వ్యాపార రంగం వైపు అడుగులేస్తున్నారు. కొందరు సొంతంగా వ్యాపారాలు చెయ్యడానికి ఇష్టపడుతుంటే.. మరికొందరు ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకొంతమంది విదేశాల్లో వ్యాపారం చెయ్యడానికి మక్కువ చూపిస్తున్నారు. ప్రస్తుతం భారత దేశంలో ఎక్కువ మంది యువత సింగపూర్, సిలికాన్ వ్యాలీలో పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా ఈ అంశంపై RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను ఎవరికంటే తక్కువ కాదు అనే మనస్తత్వం కోహ్లీది. ప్రస్తుతం భారత దేశంలోని యువత కూడా అదే మనస్తత్వంతో ఉన్నారని తెలిపారు. తాము ఎవరికంటే తక్కువకాదని.. ప్రపంచ మార్కెట్‌లో రానించాలానే ఆలోచనలతో విదేశాలకు వెళ్లి అక్కడ వ్యాపారం చేసేందుకు యువత మక్కువ చూపుతున్నారని పేర్కొన్నారు. అలానే ప్రస్తుతం యువత ఇండియాలో సంతోషంగా లేరని ఆయన అన్నారు.


Next Story

Most Viewed