పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మొదటి ట్రాన్స్‌జెండర్స్ జంట..

by Disha Web Desk 6 |
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మొదటి ట్రాన్స్‌జెండర్స్ జంట..
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలోని మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్స జంట తల్లిదండ్రులయ్యారు. కేరళకు చెందిన జియా, జహద్ ఫిబ్రవరి 8న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కానీ, వాల్లకు పుట్టింది మగ శిశువా, ఆడ శిశువా అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జియా, జహద్ ఇటీవల తల్లిదండ్రులు కాబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరు మూడేళ్లుగా కలిసే జీవిస్తున్నారు. అయితే మగ అయిన జియా లింగ మార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారుతోంది. మరోవైపు అమ్మాయిగా పుట్టిన జహద్ కూడా లింగ మార్పిడితో అబ్బాయిగా మారుతున్న క్రమంలో తల్లిదండ్రులయ్యారు.

Next Story