- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఆ మజాకా.. జగన్ సమక్షంలో బాహుబలి ఇంటర్వెల్ సీన్ రిపీట్
దిశ వెబ్ డెస్క్: ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అనడానికి వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదాహరణగా నిలిచారు. ఎవరైనా ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు ఆ కార్యక్రమానికి ప్రజలు అభిమానంతో వస్తే వాళ్ళను అభిమానులు అని అంటారు. అదే బెదిరించి బలవంతంగా వచ్చేలా చేస్తే వాళ్ళ సత్తా చూపిస్తారు, అనడానికి నిన్న జరిగిన జగన్ బస్సు యాత్రే నిదర్శనం.
అసలే ఎన్నికల సమయం.. పైగా పవన్ ఫాన్స్, వాళ్ళను గెలికితే ఎలా ఉంటుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంజనీరింగ్ విద్యార్థులు ట్రైలర్ చూపించారు. వివరాల్లోకి వెళ్తే.. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడలో బస్సు యాత్రను నిర్వహించిన విషయం అందరికీ తెలిసందే. కాగా ఈ కార్యక్రమానికి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు కూడా హాజరయ్యారు.
కాగా ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తీవ్ర అవమానం జరిగింది. బాహుబలి సినిమాలో భల్లాలదేవ విగ్రహప్రతిష్ఠ జరుగుతుంటే ప్రజలు బాహుబలి బాహుబలి అని నినాదాలు చేసినట్టు, జగన్ బస్సు యాత్రకి వచ్చిన విద్యార్థులు జగన్ ముందే జై పవన్ కళ్యాణ్, బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ పవన్ కళ్యాణ్కి అనుకూలంగా, సీఎం డౌన్ డౌన్ అంటూ జగన్కి ప్రతికూలంగా నినాదాలు చేశారు.