అంబులెన్స్‌లో పడుకుని 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ రాసిన విద్యార్థిని (వీడియో)

by Disha Web Desk 12 |
అంబులెన్స్‌లో పడుకుని 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ రాసిన విద్యార్థిని (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని సోమవారం అంబులెన్స్‌లో ఎస్‌ఎస్‌సీ పరీక్షకు హాజరైంది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ముబాషిరా సాదిక్ సయ్యద్ పోయిన శుక్రవారం మొదటి పరీక్ష రాసి ఇంటికి వెళుతున్నప్పుడు కారు ప్రమాదంలో గాయపడింది. దీంతో విద్యార్థిని కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో శస్త్రచికిత్స చేశారు. కాగా ఆమె నడవడానికి వీలు లేదని డాక్టర్లు తెలిపారు.

దీంతో సోమవారం పరీక్ష ఉండటంతో అంబులెన్స్ లోనే ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చి అంబులెన్సులోని బెడ్ మీదనే పరిక్ష రాసింది. ఈ సందర్భంగా విద్యార్థిని ముబాషిరా సాదిక్ సయ్యద్ మాట్లాడుతూ.. "నా ఉపాధ్యాయులు నన్ను పరీక్షకు ఎంతగానో ప్రోత్సహించారు. అలాగే, నా తల్లిదండ్రులు నాకు అండగా నిలిచారు" అని చెప్పింది. కాగా ప్రస్తుతం ఆ బాలికకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story