మానవాళి మనుగడకు చెట్లే ప్రధానం-మేయర్ రామ్మోహన్

by  |
మానవాళి మనుగడకు చెట్లే ప్రధానం-మేయర్ రామ్మోహన్
X

మాన‌వాళి మ‌నుగ‌డ‌కు చెట్లే ప్ర‌ధానమని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొంతు రామ్మోహన్, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, ఎంపీ సంతోష్ కుమార్, క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్‌ తదితరులు పాల్గొని.. స్టేడియం ఆవరణలో 10 వేల మొక్కలను నాటారు. ప్ర‌జ‌లంద‌రికీ ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించి, ఆరోగ్య సంరక్ష‌ణ‌కు లంగ్ స్పేస్‌ల‌ను అభివృద్ది చేస్తున్న‌ట్లు బొంతు రామ్మోహన్ తెలిపారు.

Next Story

Most Viewed