లైంగికంగా వేధించినందుకు..వ్యక్తి దారుణ హత్య

by  |

దిశ , వరంగల్
లైంగికంగా వేధిస్తుండటంతో భరించలేని ఓ వ్యక్తి అతని మిత్రున్ని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.ఈ ఘటన వరంగల్ పట్టణం కేయూ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన హరితం హరిబాబు(హోమో సెక్సువల్)(36)కు కాకతీయ యూనివర్సిటీ సమీపంలోని సదానందకాలనీకి చెందిన కారు డ్రైవర్ దుండి సురేష్‌తో పరిచయం ఏర్పడింది.గత ఐదేండ్లుగా వీరు సాన్నిహిత్యంగా ఉంటూ, ఆర్థిక లావాదేవీలు సైతం పరస్పరం జరుపుకున్నారు.ఈ నేపథ్యంలోనే హరిబాబు తన మిత్రుడు సురేష్‌ను లైంగిక వేధింపులకు గురి చేశాడు. మంగళవారం రాత్రి మద్యం సేవించిన అనంతరం ఈ విషయంలో ఇరువురు గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన సురేష్ కత్తితో హరిబాబును పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు నేరుగా స్థానిక పోలీసుస్టేషన్ కు వెళ్లి తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కేయూ పోలీసులు తెలిపారు.


Next Story