తెలంగాణలో ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ

by Vadlamudi Anukaran |

<p>దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ జిల్లాలో డీఎఫ్ వోగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్. పీ. సుతాన్‎ను డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‎గా పోస్టింగ్ ఇచ్చి ములుగులోని తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‎కు డీన్‎గా నియమించింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎఫ్ డీవోగా విధులు నిర్వర్తిస్తున్న పెట్ల రాజశేఖర్‎ను ఆదిలాబాద్ డీఎఫ్ వోగా నియమిస్తూ బదిలీ చేస్తున్నట్లు సీఎస్ సోమేశ్ [&hellip;]</p>

తెలంగాణలో ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ జిల్లాలో డీఎఫ్ వోగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్. పీ. సుతాన్‎ను డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‎గా పోస్టింగ్ ఇచ్చి ములుగులోని తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‎కు డీన్‎గా నియమించింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎఫ్ డీవోగా విధులు నిర్వర్తిస్తున్న పెట్ల రాజశేఖర్‎ను ఆదిలాబాద్ డీఎఫ్ వోగా నియమిస్తూ బదిలీ చేస్తున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి డివిజన్‎లో ఎఫ్ డీవోగా విధులు నిర్వర్తిస్తున్న భూక్య లావణ్యను జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీఎఫ్ వోగా, ములుగు జిల్లాలో ఎఫ్ డీవో గా ఉన్న బోగ నిఖితను కామారెడ్డి డీఎఫ్ వోగా బదిలీచేశారు. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి హెచ్ ఆర్డీ ఇనిస్టిట్యూట్‎లో స్పెషల్ ఫౌండేషన్ కోర్స్ చేస్తున్న వికాస్ మీనాను నిర్మల్ జిల్లా డీఎఫ్ వో గా నియమించారు.

Next Story