- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి–కావేరి లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను ఏప్రిల్లోనే రాష్ట్రాలకు పంపించామని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు. రాజ్యసభలో ఆయన ఈ అంశంపై సోమవారం వివరణ ఇచ్చారు. గోదావరి నుంచి కావేరికి 247 టీఎంసీలను తరలించేందుకు ప్రాజెక్టు ను రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. గోదావరి నుంచి కృష్ణా, పెన్నా బేసిన్ మీదుగా ఈ నీటిని తరలిస్తామన్నారు. దీనికి మొత్తం మూడు లింకులు ఉంటాయని వివరించారు.
గోదావరిపై ఇచ్చంపల్లి నుంచి మొదలవుతుందని, నాగార్జున సాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) నుంచి కావేరి (గ్రాండ్ అనికట్) వరకు తరలిస్తామన్నారు. సాగు, తాగునీటి అవసరాల కోసం 200 టీఎంసీలు కావాలని తమిళనాడు కోరిందని, దీనిపై పూర్తిస్థాయి డీపీఆర్ను రూపొందించి, రాష్ట్రాలకు పంపించామన్నారు. కానీ రాష్ట్రాల నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని కేంద్ర మంత్రి చెప్పారు. గోదావరి–కావేరి లింక్ ప్రాజెక్టుకు ఇంకా నిధుల కేటాయింపు చేయలేదన్నారు.