భోపాల్‌లో కుప్పకూలిన ట్రైనీ విమానం..

by  |
భోపాల్‌లో కుప్పకూలిన ట్రైనీ విమానం..
X

దిశ, వెబ్‌డెస్క్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. ట్రెయినింగ్ విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ముగ్గురు పైలట్లు గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన శనివారం మధ్యాహ్నం వెలుగుచూసింది. ప్రస్తుతం గాయాలపాలైన పైలట్లకు చికిత్స అందిస్తున్నట్లు SHO అరుణ్ శర్మ తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Next Story