నదిలో ఏనుగు.. దానిని కాపాడబోయి జర్నలిస్ట్ మృతి

by  |
నదిలో ఏనుగు.. దానిని కాపాడబోయి జర్నలిస్ట్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: నది దాటుతుండగా ప్రమాదవశాత్తు అందులో పడిన ఏనుగు.. దానిని కాపాడబోయి ఇద్దరు మృతిచెందిన ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈనెల 24న ఒడిశాలోని మండలి వద్ద మహానది నదిని దాటుతుండగా అందులో ఓ ఏనుగు మహానదిలో చిక్కుకుంది. ఆదివారం జోబ్రా బ్యారేజీ వద్ద ఆ ఏనుగు మృతదేహం కనిపించింది. అయితే, నదిలో ఏనుగు కొట్టుకుపోయిందన్న విషయం తెలిసి ఓడీఆర్ఏఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి దానిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, ఆ ఏనుగు రెస్క్యూ బోట్ పై దాడి చేసింది. దీంతో ఆ పడవలో ఉన్న సీతారామ్ అనే వ్యక్తితోపాటు ఓ జర్నలిస్ట్ కూడా మృతిచెందాడు. మిగతావారు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది.


Next Story

Most Viewed