- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, హుజూర్నగర్ : జాన్ పహడ్ సైదులు దర్గాకు మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పింది. ఈ ఘటనలో 10 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట సరిహద్దు ప్రాంతమైన దామరచర్ల మండలం మూసీ బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పారం మండలం మాదలా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 20మంది భక్తులు ట్రాక్టర్ ద్వారా మెుక్కులు చెల్లించేందుకు హుజూర్నగర్ నియోజకవర్గం పాలకవీడు మండలంలోని జాన్ పహడ్ దర్గాకు వస్తున్నారు.
దామరచర్ల మండలంలోని మూసి బ్రిడ్జి సమీపంలోనికి రాగానే అక్కడ రోడ్డు డౌన్ ఉండటంతో ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి గేర్ను న్యుటల్ చేశాడు. దీంతో వాహనం వేగం పెరిగింది. రోడ్డు మొత్తం గుంతలుగా ఉండటంతో పాటు సడన్ బ్రేక్ వేయడంతో ట్రాక్టర్ ట్రాలీ ఊడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా, మరో 10 మందికి మామూలు గాయలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే 108 వాహనం ద్వారా మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు .