రోశయ్య జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం : రేవంత్ రెడ్డి

by  |
రోశయ్య జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం : రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, మాజీ పీసీసీ అధ్యక్షులు రోశయ్య అకాల మరణం పట్ల రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దివంగత నేత రోశయ్య జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని కొనియాడారు. నీతి నిజాయితీ, నిబద్ధత, ప్రజా సేవ పట్ల అంకితభావం, సిద్ధాంతాల ఆచరణలో రోశయ్య ముందంజలో ఉంటారని రేవంత్ ప్రశంసించారు. ఈ క్రమంలోనే రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

రాష్ట్రం ఒక ఆర్ధిక నిపుణుడిని కోల్పోయింది: అచ్చెన్నాయుడు



Next Story

Most Viewed