నోముల మృతి తీరని లోటు :ఉత్తమ్

by  |
నోముల మృతి తీరని లోటు :ఉత్తమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బడుగు బలహీన వర్గాల తరపున పోరాటం చేసిన నాయకుడు నోముల నర్సింహయ్య అకాల మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. నోముల నర్సింహయ్య తనకు అత్యంత సన్నిహితుడని, మంచి మిత్రుడని చెప్పుకొచ్చారు. సహచర ఎమ్మెల్యేగా సుదీర్ఘ కాలం కలిసి పని చేశామని అన్నారు. ఆయన ప్రజా సమస్యలపై చేసే పోరాటాలు ప్రజల్లో మంచి ముద్ర వేసాయని ఉత్తమ్ గుర్తు చేసుకున్నారు.

Next Story

Most Viewed