- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి, సీతక్కల అన్నాచెల్లెల ఆప్యాయత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ఎంత పెద్ద సభ నిర్వహించినా వారి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటుంటారు. ఏకంగా తన కుర్చీనైనా సీతక్కకి ఇచ్చేస్తానంటూ రేవంత్ చేసిన ప్రకటనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర యాత్రలో సీతక్క పాల్గొన్నారు. నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేసి తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకొని సీతక్క ఎమ్మార్వోకి వినతిపత్రం అందించారు. అనంతరం ఉన్నట్టుండి ఒక్కసారిగా సీతక్క అస్వస్థకు గురయ్యారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆమెను స్థానిక సామాజిక వైద్యశాలలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు లోబీపీతో సీతక్క నీరసించిపోయారని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని తెలిపినట్లు ట్విట్టర్లో సీతక్క అకౌంట్లో తన అనుచరులు ప్రకటించారు. అయితే దీనిపై స్పందించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ‘‘నువ్వు త్వరగా కోలుకోవాలి అక్క’’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరగా మారింది.
Get well soon akka
— Revanth Reddy (@revanth_anumula) September 21, 2021