విజయశాంతితో మాణిక్యం ఠాగూర్ భేటీ

by  |
విజయశాంతితో మాణిక్యం ఠాగూర్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి రాజకీయ భవిష్యత్తుపై గతకొంతకాలంగా విస్తృతంగా ప్రచారం కొనసాగుతోంది. బీజేపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం విజయశాంతితో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్యాదపూర్వకంగా విజయశాంతిని కలిశానని తెలిపారు. పార్టీ భవిష్యత్తు కోసం సుదీర్ఘంగా చర్చించామని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో ఆమె భేటీ అయిన విషయంపై తాను చర్చించలేదని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed